ENG vs PAK: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుతుంది. కోవిడ్ కారణంగా ఇంగ్లాండ్ కొత్త ఆటగాళ్లతో పాకిస్తాన్ వన్డే సిరీస్ కి బరిలోకి దిగింది. అయితే పాకిస్థాన్ జట్టుతో మూడు వన్డేల్లో పరాభవం చెంది వైట్ వాష్ కి గురైంది.
అలా వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేని పాకిస్తాన్ నిన్న జరిగిన మొదటి టీ20 లో మాత్రం ఒక్కసారిగా జూలు విదిల్చింది. టీ20ల్లో తమ అత్యధిక స్కోరు ని నమోదు చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. మొదటి వికెట్ కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజామ్ 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్ చివర్లో బ్యాటు ఝళిపించడంతో పాకిస్తాన్ భారీ స్కోరు సాధించింది. బదులుగా తమ సీనియర్ ప్లేయర్లతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఈసారి భారీ హిట్టర్లతో అటాకింగ్ గేమ్ మొదలుపెట్టింది. పవర్ ప్లె లో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ 69 పరుగులు సాధించారు.
ఆ తర్వాత కేవలం 43 బంతుల్లో 103 పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్ తరపున వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోవడంతో పాకిస్తాన్ 31 పరుగుల భారీ విజయం సాధించింది. షాహీన్ అఫ్రిదీ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సాధించాడు.
ఇలా టి20 ప్రపంచకప్కు ముందు తాము తేలికగా తీసి పారేసే జట్టు కాదని పాకిస్తాన్ చాటిచెప్పింది. ముందు వైట్ వాష్ అయిన తర్వాత వీరి ప్రదర్శన ఆశ్చర్యమైనదనే చెప్పాలి. కాబట్టి పాకిస్తాన్ తో పెద్ద జట్లకు పెద్ద డేంజర్ పొంచి ఉంది.