ENG vs PAK: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారు అత్యంత పేలవంగా ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇంగ్లండ్తో నేటి నుండి మొదలైన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్తాన్ ఘోరపరాజయం మూటగట్టుకుంది. కరోనా కారణంగా తమ ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ కు సిద్ధమైంది ఇంగ్లండ్.
తమ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత 11 మంది కొట్టు ఆటగాళ్లతో ఈ రోజు మ్యాచ్ కు బరిలోకి దిగింది. కెప్టెన్ స్టోక్స్ ఒక్కడే వారిలో చెప్పుకోదగ్గ ప్లేయర్. ఇక ఒకరిద్దరు ఆరంగేట్రం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 35.2 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ ఓపెనర్ పక్క ఫకర్ జమాన్ 47 పరుగులతో పర్వాలేదనిపించగా చివర్లో shadab khan 30 పరుగులు చేయడంతో పాకిస్తాన్ పరువు నిలబడింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు వికెట్లతో తన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే సత్తా చాటాడు. ఓవర్టన్, పార్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ చేసిన చిన్న స్కోర్ కి బదులుగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 21.5 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది. మలాన్ 68 పరుగులతో, జాక్ క్రాలీ 58 పరుగులతో రెండో వికెట్ కు ఇంగ్లాండ్ విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
ఇక పాకిస్తాన్ సీనియర్లతో దిగినప్పటికీ… టీమ్ కాంబినేషన్లలో ఏ మాత్రం ఇబ్బంది లేకపోయినా ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ తో పాక్ తడబడింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుండి రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో వారికే తెలియదు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?