EPF Rules: ఇది కేవలం ఉద్యోగుల కోసమే. మిగిలినవారు మీ ఇంట్లోగాని, సమీపంలోగాని ఎవరైనా ఉద్యోగులు ఉంటే ఈ విషయాన్ని వారికి చేరవేయండి. మీకు PF అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది. వచ్చే నెల అనగా ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి కనుక కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. తెలుసుకోండి.. రూ. 2.5 లక్షలకు పైన PF ఫండ్పై ట్యాక్స్ పడుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్ సమావేశంలోనే ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.
EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ తేదీని అప్డేట్ చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు గల్లంతు..
EPF Rules: మరిన్ని విషయాలు ఇవే…
జరిగిన బడ్జెట్ ప్రాతిపదికన ప్రావిడెంట్ ఫండ్లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ లిమిట్ రూ.5 లక్షల వరకు ఉండటం తెలిసినదే.
EPFO Loans : ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..!!
ఏప్రిల్ 1 నుంచి తెలుసుకోవాల్సిన 5 అంశాలు ఇవే:
1. ప్రావిడెంట్ ఫండ్ వార్షిక కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు ఒకవేళ దాటితే మాత్రం 2 ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది. అంటే ఈ లిమిట్కు మించిన డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేయాలి.
2. ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఎవరైతే వుంటారో అంటే దాదాపు 1.23 లక్షల మందిపై ఈ ప్రభావం పడొచ్చు. వీరందరూ ఏడాదిలో రూ.50 లక్షలకు పైన పన్ను రహిత వడ్డీ ఆదాయం పొందుతున్నారు.
3. రూ.2.5 లక్షల లిమిట్లో ఉద్యోగి, కంపెనీ రెండింటి కంట్రిబ్యూషన్స్ కలిసి ఉంటాయి. ఉద్యోగి బేసిక్ వేతనం, DAలో 12% PF ఖాతాకు వెళ్తుంది. కంపెనీ కూడా EPF ఖాతాకు 3.67 శాతాన్ని, EPSకు 8.33 శాతానికి కంట్రిబ్యూట్ చేస్తుంది.
4. ఒక PF కంట్రిబ్యూటర్ కోసం రెండు PF ఖాతాలను కలిగి ఉండాలి. అందుకే దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సవరించారు.
5. రూ.2.5 లక్షలు దాటి ఇన్వెస్ట్ చేసే మొత్తంపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ పడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు.