ఈషా రెబ్బ తెలుగు అమ్మాయి ఈశా రెబ్బ.. అటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది..దాదాపు 11 ఏళ్ల కిందనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈశా రెబ్బ ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా ఇప్పటికీ ఈ బ్లాక్ బ్యూటీకి సరైన హిట్ రాలేదు.. అదీ కాక టాలీవుడ్ అగ్ర హీరోలు ఎవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఆయా చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలు, చిన్న సినిమాలకు లీడ్ రోల్స్ చేస్తూ వస్తోంది.
ఈశా రెబ్బ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. కానీ, అందులో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.. ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్ గా లీడ్ రోల్ చేసింది. ఆ సినిమా తర్వాత ‘అమీ తుమీ’, ‘బందిపోటు’, ‘అ’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటించింది.. అయితే తెలుగు సినిమాల్లో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.
దీంతో ఈషా రెబ్బ ప్రస్తుతం తమిళ చిత్రాలపై దృష్టి పెట్టింది. చిన్న బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తన పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.. ఏ చిన్న అవకాశం వచ్చినా.. దాన్ని వదులుకోవడం లేదు.. ఓటీటీ ఒరిజినల్స్ లో క్రేజీ అండ్ బోల్డ్ రోల్స్ కూడా చేస్తోంది. ప్రస్తుతం ‘అయిరామ్ జెన్మంగల్’ అనే తమిళ చిత్రం, ‘ఒట్టు’ అనే మలయాళ సినిమాలో నటిస్తోంది..
ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. తన గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, సినిమా కబర్లను సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటూ ఉంటుంది.. తాజాగా ఆమె తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెండీ వేర్ లో ఎద అందాలను అలా బయటపెట్టి నెటిజన్ల మతిపోగొడుతోంది. మత్తు పోజులతో కుర్రాళ్లకు పిచ్చెకిస్తోంది. ఈ భామ గ్లామర్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.