ESI స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఈఎస్ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్ లతో ఆర్డర్లు ఇచ్చినట్టుగా గుర్తించింది ఏసీబీ విజిలెన్స్.
టెండర్లు పిలవకుండా నామినేషన్ల పద్ధతిన అనుమతులు ఇచ్చినట్లు, దాదాపు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లల్లో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీపీ దర్యాప్తులో తేలింది. మార్కెట్ ధర కన్నా 50 నుంచి 135 శాతం ఎక్కువ కు మందులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో ఏసీపీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ తో అచ్చెన్నాయుడు కి సంబంధం ఉన్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. అంతేకాకుండా బయోమెట్రిక్ మిషన్ల కొనుగోలు లోనూ నిధులు దుర్వినియోగం అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ESI స్కామ్ లో ఇంకా చాలా మంది అప్పట్లో టీడీపీ లో పనిచేసిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్లు త్వరలోనే ఏసీపీ విజిలెన్స్ వాళ్లను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు మీడియా వర్గాలలో ప్రభుత్వ వర్గాలలో వార్తలు వినపడుతున్నాయి.