NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Etela Rajendar: తెలంగాణలో అతి పెద్ద భూస్కామ్ ఇదేనా..! ఈటెలతో సహా ఇంకా పెద్దల పాత్ర..!?

Etela Rajendar: భూకబ్జా ఆరోపణపై మంత్రి ఈటెల రాజేందర్ ను కేసిఆర్ సర్కార్ మంత్రివర్గం నుండి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో దేవరయాంజాల్ సీతారామాలయం భూముల వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు. ఈ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయి. అసలు ఈ భూముల సంగతి ఏమిటి, ఈ భూముల కబ్జాల వెనుక ఎంత మంది పెద్దలు ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే దేవరయాంజాల్ భూముల్లో మంత్రులు కేటిఆర్, మల్లారెడ్డిలకూ భూములు ఉన్నాయనీ, ఈ భూముల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీీీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అసలు దేవరయాంజాల్ భూముల కథ ఏమిటి అన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి పెరిగింది.

Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam

ఈ భూముల గురించి విషయం ఏమిటంటే… కరీంనగర్ జాతీయ రహదారిలో హకీంపేట విమానాశ్రయం హద్దు గోడ తరువాత ఉన్న ప్రాంతమే దేవరియాంజాల్, ఇది గతంలో మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల పరిధిలోని గ్రామం కాగా ఇప్పుడు పక్కనే ఉన్న తూముకుంట గ్రామ మునిసిపాలిటీగా ఏర్పాటు అయిన తరువాత ఈ గ్రామంలో అందులో విలీనం అయ్యింది. ఇక్కడి సీతారామ ఆలయానికి సుమారు 1500 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. 1944 సెత్వార్ ప్రకారం దేవరయాంజాల్ భూములన్ని ఆలయం పేరుపైనే ఉన్నాయి. అయితే 1954 -55 మధ్య ఖాస్రా పహాణీ లో సీతారామ స్వామి దేవస్థానం పేరు స్థానంలో ప్రైవేటు వ్యక్తుల పేర్లు రాసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆలయానికి చాలా తక్కువ సంఖ్యలో భూములు ఉన్నాయి.

Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam
Etela Rajender devaryamjal temple land scam

ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల క్రయ విక్రయాల ద్వారా వందల ఎకరాలు చేతులు మారాయి. ఈ భూముల్లోనే ఈటల రాజేందర్ 1980లో ఆరున్నర ఎకరాలు కొనుగోలు చేశానని చెబుతుండగా అధికారులు మాత్రం 60 ఎకరాలకు కబ్జా చేశారని అంటున్నారు. దేవరయాంజల్ లో ఆలయ భూములు కొనుక్కొని సాగు చేసుకుంటున్న చాలా మంది రేైతులు, ప్రైవేటు వ్యక్తులు భూముల క్రమబద్దీకరణకు దశాబ్దాల తరబడి కోర్టులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ భూముల వ్యవహారాన్ని గతంలో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి, ఆ తరువాత సీఎం కేసిఆర్ దృష్టికి ఈటల రాజేందర్ తీసుకువెళ్లారు. ఈ భూముల కబ్జా వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలు ఉండటం వల్ల స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలన్న డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈటలకు చెందిన జమున హెచరీస్ భూమలపై ఇటీవల హైస్పీడ్ గా జరిగిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. కేసిఆర్ సర్కార్ ఈ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు గానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ విచారణకు లేదా చూడాలి మరి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju