కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విషయంలో గతంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నో ఎంట్రీ ఇస్తూ ఆదేశాలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా… సీబీఐకి తమ రాష్ట్రంలో నో ఎంట్రీ అని తెలిపింది. ఇదిలా ఉండగా తాజాగా కేరళ రాష్ట్రంలో సిపిఎం ప్రభుత్వం కూడా సి.బి.ఐ కి షాకిస్తు నిర్ణయం తీసుకుంది.
సిబిఐ ఢిల్లీ పోలీస్ చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థ అని అందువల్ల ఆయా రాష్ట్రాలు సిబిఐ ఆయా కేసుల దర్యాప్తు లకు అనుమతులు ఇవ్వవలసి ఉంటుంది అని పేర్కొంది. ప్రతి కేసుకు కాకుండా, సాధారణ అనుమతి ఇస్తుంటాయి. కాగా కేంద్రం రాజకీయ ఉద్దేశాలతో ప్రత్యర్థులపై సీబీఐ ని ప్రయోగిస్తుంది అన్న భావన గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న నాటి నుండి ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
తాజాగా ఇండియా ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. తాజాగా ఈ జాబితాలోకి కేరళ కూడా రావటం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సిబిఐ ఎంట్రీ కి అనుమతి ఇవ్వకుండా రద్దు చేసిన విధానాన్ని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనుమతిని పునరుద్ధరించడం విశేషం.