టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరసగా తన సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నాడు. వాస్తవంగా ఈ ఏడాదే మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కాని కరోనా కారణంగా ఒక్క భీష్మ సినిమా మాత్రమే రిలీజ్ చేయగలిగాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ టార్గెట్ ని 2021 లో కంప్లీట్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాడు.
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పటికే చేస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తుంది. సగానికి పైగా చిత్రీకరణ జరిగిన ఈ సినిమా లాక్ డౌన్ తో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా త్వరలోనే టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది. దాంతో మిగతా రెండు ప్రాజెక్ట్స్ ని ట్రాక్ లోకి తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాదూన్’ సినిమాని నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో టబు చేసిన పాత్రని ఇక్కడ తమన్నా చేస్తోంది. అలాగే హీరోయిన్ గా నభా నటేష్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాని త్వరలో సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సన్నాహాలు జరుగుతున్నాయట.
ఇక రీసెంట్ గా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ నటించబోతున్న మరో సినిమాని ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ అధికారకంగా ప్రకటించారు. ‘చెక్’ అన్న టైటిల్ తో తెరకెక్కబోయో ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాదు 2021 లో రంగ్ దే, అంధాధున్ రీమేక్, చెక్.. రిలీజ్ చేయాలని నితిన్ టార్గెట్ పెట్టుకున్నాడట.