ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 106 చేస్తున్నారు. ఈ సినిమాతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి గత కొన్ని రోజులుగా “మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
అలాగే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే ఇద్దరు హీరోయిన్స్ ని త్వరలో ప్రకటించనున్నారని తాజా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు. లాక్ డౌన్ లో పూరి బాలయ్య కోసం కథ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఆ కథ బాలయ్య కి కూడా నచ్చిందని తెలుస్తుంది.
అయితే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు బాలకృష్ణ ల ఆదిత్య 369 వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాకి సీక్వెల్ ఆదిత్య 999 నిర్మించాలని అనుకుంటున్నట్టు ఈ మధ్య బాగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లేనట్టే అని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ దర్శకులు సింగీతం శీనివాస రావు ట్రెండీ సబ్జెక్ట్ ని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే యూత్ ని ఆకట్టుకునే కథ రాస్తున్నట్టు సమాచారం. ఇక నందమూరి అభిమానులు కూడా ఆదిత్య 999 ఉండకపోవచ్చని కూడా భావిస్తున్నారట.