భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గొడవలు జరగడం అనేది చాల సహజం. అంతేకాదు ప్రేమ ఉన్న చోటే గిల్లికజ్జాలుపుట్టుకొస్తాయి అని పెద్దలు అంటుంటారు. అలా అని అస్తమాను గొడవలు పడుతూ పోతే మాత్రం దాంపత్య జీవితం ప్రశ్నర్ధకం గా మారుతుంది. అయితే మనం రెండు వర్గాల మనుషుల్ని చుస్తూఉంటాం. మొదటి రకం వారు కోపం వచ్చినప్పుడు మొహం మీదే అన్ని తిట్టేసి తర్వాత క్షమాపణ చెప్పేస్తారు. జరిగిందంతా మర్చిపోయి మళ్లీ భాగస్వామితో ప్రేమగా, సంతోషంగా గడిపేస్తుంటారు.
ఇక రెండో రకానికి వస్తే, వీళ్లుఏవిషయని అంత తేలికగా బయటకు చెప్పరు. గొడవ జరిగిన తర్వాతక్షమాపణలు లాంటివి ఏమి ఉండవు సరికదా.. మనం చెప్పినా కూడా వారు పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు.. ఓ పట్టాన సహజ స్థితికి రాలేరు .ఇలా జరిగే చిన్న చిన్న వాదనలు కూడా మనసులో పెట్టుకుని భాగస్వామిని ద్వేషించడం మొదలు పెడతారు . ఇక్కడ మొదటి రకం వారితో ఎలాంటి సమస్య రాదు . రెండో రకం వారితో నే అసలైన సమస్య. వీరు మనసులో ఉన్నది బయట కు చెప్పకుండా లోలోపలే ద్వేషం తో ఉంటారు . కొన్నాళ్లకు .. ఇదంతా అయ్యేపని కాదని భాగస్వామితో తెగతెంపులు చేసుకుంటారు. కొందరైతే, విడిపోలేక వారిని అలాగే భరిస్తూఉంటారు.
అయితే మీ భాగస్వామి తో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మొహం మీద తిట్టేయక పోయిన..నెమ్మది గా జరిగినదానిగురించి మాట్లాడి మీ సమస్య గురించి చర్చించి పరిష్కరించుకుని జీవితం లో సంతోషం గా ముందుకు సాగండి…సమస్య లోపల పెట్టుకుని కుమిలి పోయి దూరం పెంచుకోకుండా బంధాలు తెగనివ్వకుండా ఎప్పటికప్పుడు క్షమా గుణం తో జీవితాన్ని స్వర్గం చేసుకోండి. సమస్యని దాచుకోవడంవలన లేదావిడిపోవడం వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు అనిగుర్తుంచుకోండి.