అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కాస్తా పెద్దవాళ్లాయి స్కూల్కు వెళ్లేవరకు తల్లి బెంగా అంతా పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని పెట్టాలో అనే ఆలోచనే . అందుకే ప్రతి తల్లి కోసం ఈ విషయాలు తెలియచేయడమైనది . పిల్లలకు అమ్మపాలే అమృతం. అమ్మ పాలను మించిన ఆహారం ఇంకొకటి లేదు అనడం లో ఎలాంటి ఆశ్చర్యము లేదు.
కాబట్టి ఏదైనా బలమైన కారణం ఉంటేనే తప్ప పాలు ఇవ్వడం మానవద్దు. ఆరోవ నెల తర్వాత నుండి పిల్లలకు అమ్మ పాలతో పాటుగా పాలతో తయారైన ఆహార పదార్థాలు ఇవ్వడం ప్రారంభించాలి. బార్లీ, బియ్యం, ఓట్స్ ,గోధుమలు, వంటివి పెట్టడం ఒక సంవత్సరం నుంచి నెమ్మదిగా మొదలుపెట్టాలి. పెరిగే పిల్లలకు కొంచెం ,కొంచెం గా కోడిగుడ్డు, చేపలు తినిపించడం ప్రారంభించాలి . పెరుగు, పాలు, చీజ్, తప్పకుండా పిల్లల ఆహారం లో ఉండేలా చూడాలి. ఇవి పిల్లల్లో ఎముకల బలాన్ని పెంచుతాయి.
6 వ నెల నుంచి పప్పుతో చేసిన పదార్ధాలు తినిపించవచ్చు. వారం లో రెండు సార్లు చేపలు, వీలైతే వారానికి ఓసారి చికెన్ సూప్ ,మటన్ సూప్, వంటివి అలవాటు చేయడం మంచిది. పంచదార కలపని పండ్ల రసం ఇవ్వడం , లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి అయినా తినిపించాలి. సంవత్సరం పాటు వైద్యుల సూచనలు పాటిస్తూ ఆహారాన్ని అలవాటు చేయాలి. తల్లిపాలు కనీసం నాలుగు నెలలైనా పిల్లలకు ఇవ్వడం చాల అవసరం.
అలా తల్లి పాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు . ఆరో నెల నుంచి ఉడికించిన క్యారెట్, ఆపిల్,బంగాళదుపం, అరటి పండు వంటివి తినిపిస్తుండాలి . ఆ తర్వాత చికెన్ ,బాగా మెత్తగా చేసిన పప్పుతో కలిపిన అన్నం, వంటివి పెడుతుండాలి. రాత్రిపూట మాంసాహారాన్ని మాత్రం ఇవ్వకూడదు. రాత్రి ఇడ్లీల వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వవచ్చు .