దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ “రౌద్రం రణం రుధిరం”. స్టూడెంట్ నంబర్ వన్ నుంచి బాహుబలి వరకు రాజమౌళి తీసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్ లను సృష్ఠించాయి. ముఖ్యంగా ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ లాంటి భారీ కాన్వాయిస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు కూడా భారీ సక్సస్ ని అందుకున్నాయి. రెండు భాగాలు కలిపి దాదాపు 1850 కోట్లకి పైగానే వసూళ్ళు సాధించి సంచలనం సృష్ఠించాయి.
అయినా అంతగా ఎప్పుడు ఒత్తిడి ని ఎదుర్కోని రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఒత్తిడి కి లోనవుతున్నాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ 80 శాతం పూర్తయిందని సమాచారం. ఇక ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాహుబలి సినిమాను మించి తారక్, చరణ్ ల ఎలివేషన్ సీన్స్ ఉంటాయని .. ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఆ సీన్స్ కి అటు తారక్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళిపై ఒత్తిడి పెరుగడానికి కారణం ప్రభాస్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న తారక్ ని చూడాలని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్ అల్లూరి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వీడియోను విడుదల చేయడంతో తారక్ అభిమానులకి తమ హీరో పాత్ర ని చూడాలనుకుంటున్నారు. అయితే ఇన్నాళ్ళు పరిస్థితులు అర్థం చేసుకొని సైలెంట్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ వచ్చి ఇప్పుడు రాజమౌళి మీద పడబోతున్నారని అంటున్నారు. అందుకు కారణం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్20 ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్ మెంట్ రావడమేనని చెప్పుకుంటున్నారు. అందుకే తారక్ ఫ్యాన్స్ నుంచి రాజమౌళి పై ఇప్పుడు ఒత్తిడి మొదలైందని సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!