కథ కంటే కథనం, మాటలతో సినిమాని నడింపించ గల సత్తా ఉన్న దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్. ముందు నుంచి కథ చాలా సున్నితంగా, చిన్న పాయింట్ అయినా కూడా ఆ కథ ని డెవలప్ చేసే విధానం..అందులో సృష్ఠించే పాత్రలు..ఆ పాత్రల ద్వారా చెప్పించే మాటలు జనాలని బాగా ఆకట్టుకుంటాయి. ఇదే త్రివిక్రం ఫాలో అయ్యో ఫార్ములా. అందుకే మాటల మాంత్రీకుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూసిన ఫీలింగ్ జనాలకి కలిగేలా చేస్తాడు ఈ మాటల మాంత్రికుడు.
సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రేక్షకులకి కావలసినంత ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. ఇక త్రివిక్రం అల్లు అర్జున్ తో తీసిన గత చిత్రం అల వైకుంఠ పురములో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా వసూళ్ళ పరంగా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్ లో అలాగే దర్శకుడిగా త్రివిక్రం కెరీర్ లో భారీ వసూళ్ళు రాబట్టిన సినిమా అంటే అల వైకుంఠ పురములో సినిమానే.
అందుకే ఈ సినిమా తర్వాత త్రివిక్రం కి బాగా డిమాండ్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకి త్రివిక్రం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారన్న టాక్ మొదలైంది. ఇప్పటి వరకు 15 కోట్ల లోపే ఉన్న త్రివిక్రం రెమ్యూనరేషన్ అల వైకుంఠ పురములో సక్సస్ తర్వాత 20 కోట్ల కి చేరిందని సమాచారం. అయితే కరోనా ప్రభావంతో అందరిని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు అడుగుతున్న సమయంలో ఇలా త్రివిక్రం రెమ్యూనరేషన్ చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది.