నాని సరసన నటించిన హీరోయిన్స్ టాలీవుడ్ లో బాగానే సెటిలయ్యారు. నివేదా థామస్, మెహరీన్, అను ఇమానియెల్ .. ఇలా చిన్న లిస్ట్ ఉంది. నాని కూడా తన సరసన నటించిన హీరోయిన్ గురించి బాగానే ప్రమోట్ చేస్తుంటాడు. నిజంగా టాలెంట్ ఉంటే అందరి ముందే పెద్ద హీరోయిన్ అవుతుందని టాలీవుడ్ కి మరో టాలెంట్ హీరోయిన్ పరిచయం చేస్తున్నామని నమ్మకంగా చెప్పేస్తాడు.
ఇక గతేడాది విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా మీద బాగానే అంచనాలున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కాని హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గురించి మాత్రం అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ అప్పట్లో యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడంతో దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు… మళ్ళీ మరో సినిమాలోను కనిపించే అవకాశం రాలేదు.
అయితే ప్రియాంక అరుళ్ మోహన్ కు ఇప్పుడు మంచి ఆఫర్లే వస్తున్నాయని సమాచారం. ‘మహాసముద్రం’ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నాడు. చాలాకాలం తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
కాగా మహాసముద్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని అంటున్నారు. అంతే కాదు బోల్డ్ గా నటించబోతుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ప్రియాంక అరుళ్ మోహన్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందట. ఇక ఈ సినిమాతోపాటు యంగ్ హీరో నితిన్ నటించబోతున్న మరో సినిమాలోనూ ప్రియాంక హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని టాక్. మొత్తానికి నాని చెప్పిందే జరగబోతుందనమాట.