సంతానం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అయితే కొందరికి కలిగిన సంతానం ఉత్తములు తెలివైన వారుగా ఉంటారు.మరి కొందరు రాక్షస ప్రవర్తన తో ఉంటారు.అసలు ఈ తేడా ఎందుకు వస్తుంది ఇందులో తల్లిదండ్రుల ప్రమేయం ఎంతఉంటుంది?మంచి సంతానం కలగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..
ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు, శంఖు స్థాపన చేయాలనుకున్నప్పుడు, గృహ ప్రవేశం చేయాలనుకున్నప్పుడు ముహూర్తం, మంచి రోజు అవునా కాదా … అని ఒకటికి పది సార్లు అలోచించి చేస్తాం. అప్పుడు ఒక బిడ్డ పుట్టి పెరగాలంటే తప్పకుండా మంచి ముహుర్తన చూసుకుని భార్య భర్తలు దగ్గర కావాలి.సత్పురుషులు పుట్టాలంటే మంచి క్షేత్రం మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు.సంతానం రెండు రకాలు గా ఉంటారు.
1.ధర్మసంతానం 2.కామ సంతానం పైన చెప్పిన విధం గా మంచి మురుహూర్తం లో కడుపున పడిన పిల్లలు ధర్మ సంతానం..వీరు నీతి ,నిజాయితీగా మంచి మనస్సు ఉన్నవారిగా ఉంటారు.కేవలం కోరిక తీర్చుకోవడానికి,అనుభవించడానికి సమయం,సందర్భం చూసుకోకుండా కోరిక తీర్చుకుంటే కలిగే సంతానమే కామ సంతానం..వీరు పుట్టిన తర్వాత మంచి చెడూ లేకుండా ప్రవర్తిస్తుంటారు.అల్లరి చిల్లరిగా తిరుగుతూ అల్లరి పెడుతూ ఉంటారు.దుష్ట స్వభావంకలవారిగా ఉన్మాదులు గా ఉంటారు.
కాబట్టి సంతానం కలిగే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, ధర్మ సంతానం కావాలా ?కామ సంతానము కావాలా అని. కొంచెం ఓపిక తో ఉండి మంచి రోజున,ప్రశాంతం గా నిర్మలం గా గర్భం ధరించండి..మంచి సంతానమును కంటే మీతో పాటుగా సమాజం కూడా సుఖం గా సంతోషం గా ఉంటుంది.పండుగలు, పౌర్ణమి, అమవాస్య, పితృదేవతల లేదా పూర్వీకుల మరణ తిథుల్లో భార్యభర్తలు ఒకరికొకరు వేరుగా ఉండాలి.ఏకాదశిని,మాస శివరాత్రికి,నవరాత్రులైన తొమ్మిది రోజులు శృంగారానికి దూరం గా ఉండాలి. పగటి పూట కూడా శృంగారం చేయకూడదు.అసురసంధ్య వేళల్లో శృంగారం చేసి గర్భం పొందితే రాక్షస మనస్తత్వం పొందుతారని పెద్దల మాట.