‘కేజీయఫ్ చాప్టర్ 2″.. ప్రస్తుతం మన ఇండియాలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో బాహుబలి తర్వాత అన్ని భాషల్లోనూ మళ్ళీ అంతటి క్రేజ్ సాధించిన సినిమా ‘కేజీయఫ్ చాప్టర్ 2’. కన్నడ రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి…క్రియోటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ‘కేజీయఫ్ చాప్టర్ 1 కి మించి సీక్వెల్ 2 ప్రపంచ స్థాయిలో భారీ సక్సస్ సాధించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా 70 శాతం కి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా తో కాస్త గ్యాప్ వచ్చిన ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ ని కంప్లీట్ చేస్తారని అంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీదనే మొదలు కావడంతో మొదటి భాగంలో రిపోర్టర్ గా కనిపించిన అనంత్ నాగ్ రోల్ ను రీప్లేస్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించి మరో క్లారిటీ వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రోల్ పూర్తిగా కొత్తది అని అలాగే ఈ రెండో భాగంకు రిలేటెడ్ గా పరిచయం కానుందని తెలుస్తుంది. మొత్తానికి అనంత్ నాగ్ రోల్ విషయంలో ఇపుడు సస్పెన్స్ మరింతగా మారింది.
కాగా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ లో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఎంటరైతే థియోటర్స్ లో పడే విజిల్స్ ఎవరూ ఊహించలేరని అంటున్నారు. అంతేకాదు ప్రకాశ్ రాజ్ పర్ఫార్మెన్స్ పరంగా అదరగొడతారు కాబట్టి ఈ సినిమా ని మరో లెవల్ కి తీసుకు వెళతారని అభిమానులు చెప్పుకుంటున్నారు.