Mahabharatham: మహాభారతం అనగానే మనకి ముందుగా గుర్తువచ్చే పేర్లు పాండవులు, కౌరవులు, మరియు ద్రౌపది. ఇక్కడ చాలామందికి తెలియని మరొక విషయం ఏమిటంటే ధృతరాష్ట్రుని కుమారులు మరియు పాండురాజుని కుమారులు ఇద్దరూ కురువంశానికే చెందిన వారు కాబట్టి వీరి ఇద్దరినీ కౌరవులు అనే అనాలి. కానీ కాలక్రమేణా ధృతరాష్ట్రుని పుత్రులలో కలిగిన ద్వేషభావానికి కారణంగా ఇద్దరు వేరు అన్న ఉద్దేశంతో కౌరవులు పాండు రాజు కుమారులను పాండవులు అని పిలవసాగారు.
ఇక కౌరవులు అనగా ధృతరాష్ట్రుని కుమారులు మరియు పాండురాజుని కుమారులు అందరూ ద్రోణాచార్యుని దగ్గరే విద్యాభ్యాసం మరియు యుద్ధవిద్యలు నేర్చుకున్నారు. అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత గురుదక్షిణగా ద్రోణాచార్యుడు అర్జునుణ్ణి ద్రుపద మహారాజుని ఓడించి, బంధించి తన దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. గురువు చెప్పినవిధంగానే చేస్తాడు అర్జునుడు. ద్రుపద మహారాజు కుమార్తే ద్రౌపది దేవి. ఇక ప్రస్తుతానికి వస్తే… ఇటీవల చరిత్రకారులకి లభించిన ఆధారాలను ఆధారంగా చేసుకుని ఆ నాటి పాంచాల దేశం ఇప్పటికీ నిజంగానే ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ఆ పాంచాల దేశం ఇప్పటి ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ ప్రాంతం అని అంటున్నారు చరిత్రకారులు. అప్పట్లో ఈ ప్రదేశము చాలాపెద్ద నగరంగా, సిరిసంపదలతో ఉండేదట. అయితే తాజాగా చరిత్రకారులు ఇక్కడ ఒక పెద్ద కట్టడాన్ని కనుగొన్నారు. ఈజిప్ట్ లోని పిరమిడ్ ని తలపించే విధంగా ఈ కట్టడం ఉంది. ఈ కట్టడం మొత్తం పూర్తిగా ఒక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉంది అలాగే ఈ కట్టడంపై ఎత్తయిన ఒక మహాశివుని విగ్రహం ఉందట. ఈ కట్టడం పైన గల శివలింగం దాదాపుగా 22 మీటర్ల ఎత్తు ఉంది. కానీ ఈ ప్రాంతంపై ఇంకా కొన్ని పరిశోధనలు జరగాలిసి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని మరియు ఆ కట్టడాన్ని ప్రభుత్వం చారిత్రక కట్టడంగా గుర్తించి అభివృద్ధి చేయాలని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.