అమరావతి: అమరావతి, విశాఖ, కర్నూల్లో అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆయా ప్రాంతాల్లో యాక్టివిటీ పెరుగుతుందని సిబిఐ మాజీ జెడి, ప్రస్తుత జనసేన నాయకుడు వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టి నాయకులు రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టాలన్నారు. రాజధానిపై ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని ఆయన సూచించారు.
సిఎం జగన్ ప్రకటనతో జిఎన్ రావు ప్రభావితం అవుతారని తాను అనుకోవడం లేదని అన్నారు. అభివృద్ధి కావాల్సిందే, అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. మూడు రాజధానుల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.