అమరావతి: దళితవాడల్లో దేవాలయ నిర్మాణానికి పది లక్షల రూపాయలకు పైగా విరాళం ఇచ్చేవారికి విఐపి దర్శనం కల్పించాలని టిటిడి బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పూర్వ టిటిడి కార్యనిర్వహణ అధికారి, రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. దేవాలయాల నిర్మాణం టిటిడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణానికి టిటిడి వద్ద తగిన నిధులు కూడా ఉన్నాయని ఐవైఆర్ అన్నారు. ఆలయాల నిర్మాణాలకు ఇంకెవరినో దేహీ అని అభ్యర్థించి వాళ్లకు విఐపి దర్శనం ఏర్పాటు చేయడం అవసరమైన నిర్ణయంగా తోచడం లేదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
టిటిడి చైర్మన్గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సోమవారం తొలి పాలకవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తొలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్నే ఐవిఆర్ తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
దళితవాడల లో 10 లక్షల కు ఎక్కువగా దేవాలయ నిర్మాణానికి విరాళం ఇచ్చేవారికి విఐపి దర్శనం. టిటిడి బోర్డు నిర్ణయం. ఈ దేవాలయాల నిర్మాణం టిటిడి బాధ్యత. తగిన నిధులు టిటిడి దగ్గరే ఉన్నాయి. దీనికి ఇంకెవరినో దేహి అని అభ్యర్థించి వాళ్లకు విఐపి దర్శనం ఏర్పాటు చేయటం అవసరమైన నిర్ణయంగా తోచటం లేదు
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 24, 2019