రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు జివి హర్షకుమార్ను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో టిడిపి బృందం పరామర్శించింది. చినరాజప్పతో పాటు శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి నేత గన్ని కృష్ణ తదితరులు హర్షకుమార్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి, కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జ్యుడిషియల్ సిబ్బందిని దూషించిన కేసులో ఇటీవల హర్షకుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.