మరో మాజీ మంత్రి అరెస్టయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ కీలక నేత, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్రని కృష్ణ జిల్లా పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఇటీవల బందరులో జరిగిన మోకా భాస్కరరావు అనే వ్యక్తి హత్య కేసులో రవీంద్రని నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అతనిపై 302,109 సెక్షన్లు ప్రకారం కేసులు నమోదు చేసి, ఈరోజు రాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద అరెస్టు చేశారు. రవీంద్ర విశాఖపట్నం వెళ్తుండగా పోలీసులు పకడ్బందీగా పట్టుకుని, విజయవాడ తరలించారు.
ఈ అరెస్టుకు గంటన్నర ముందు మచిలీపట్నం డిఎస్పీ మహబూబ్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… “మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతో నే హత్య చేసాం ప్రధాన నిందితుల వాంగ్మూలం ఇచ్చారు. భాస్కరరావు హత్య కేసులో ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ చేశామని చెప్పారు. ముందుగా నోటీసులు ఇచ్చేందుకు కొల్లు ఇంటికి వెళ్లిన పోలీసులు, కొల్లు లేకపోవడంతో వెనుతిరిగిన పోలీసులు. చివరికి మూడు బృందాలతో గాలించి తుని వద్ద పట్టుకున్నారు.