కడప: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ప్లాంట్ అనుమతించేది లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలోని ప్రజల పరిస్థితిని స్వయంగా చూశామని పేర్కొన్నారు. యురేనియం ప్రాజెక్టు వల్ల నల్లమలలో అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న చెంచులకు, ఇతర గిరిజన వర్గాలకు, పశు పక్షాదులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. డీ ఫారెస్టు చేసి ఈ ప్రాజెక్టును తీసుకువెళ్లాల్సిన అవసరం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఉందనేది అర్థం కావడం లేదని అఖిలప్రియ అన్నారు. డ్రిల్లింగ్ జరుగుతున్న పరిసర గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలని అఖిలప్రియ కోరారు. పరిసర ప్రాంతాలు నాశనం అయ్యే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు.
#savenallamallaforest we have seen the condition of people in tummalapalle village in kadapa dist. We will not allow Uranium plant in allagadda. Nallamalla is home for many. The state govt needs to act now. @ncbn @naralokesh @PawanKalyan @JP_LOKSATTA #save_allagadda pic.twitter.com/OL4ZoVql0F
— Bhuma Akhila Reddy (@bhuma_akhila) September 28, 2019