అమరావతి: బిజెపి నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం మందడం గ్రామంలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. 24 గంటల దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి సమస్య ఈ ప్రాంత సమస్య మాత్రమే కాదనీ, రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. అందరూ రైతుల పోరాటం కు మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంతో రాష్ట్ర బిజెపి మాట్లాడుతుందని తెలిపారు. రాజధాని మార్పు కరెక్ట్ అని ఎవరూ అనటం లేదని వాఖ్యానించారు. రైతుల దీక్ష స్పూర్థిదాయకమని అన్నారు. రైతులు చేస్తున్న పోరాటం న్యాయమైనదని పేర్కొంటూ రైతులు విజయం సాధిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.