తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, తెలుగు దేశం పార్టీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ అరెస్టయ్యారు. నిన్నటి నుండి జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఈరోజు అరెస్టుతో కొత్త మలుపు తిరిగినట్లైంది. నిన్న సాయంత్రం బెయిల్ పై కడప సెంట్రల్ జైలు నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి విడుదలైన సంగతి తెల్సిందే.
అయితే జేసీ అనుచరులు 20 వాహనాలతో వచ్చి ర్యాలీగా తాడిపత్రికి తీసుకెళ్లారు. అయితే అనంతపురం శివార్లలో పోలీసులు ఆపి ఇలా ర్యాలీగా వెళ్లకూడదని ప్రశ్నించగా జేసీ పోలీసులపై దుర్భాషలాడారు. దీంతో ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ మళ్ళీ అరెస్టయ్యారు. జేసీ అరెస్ట్ ప్రభావం కారణంగా తాడిపత్రిలో 144 సెక్షన్ అమలు చేసారు. భారీగా పోలీసులను మోహరించారు.