జనసేన నుండి బయటకు వచ్చాక చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్ లో తిరిగి యాక్టివ్ కానున్నారట.
జగన్ అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా రాష్ట్రంలో అత్యంత ఇమేజ్ ఉన్న పోలీస్ అధికారిగా జేడీ లక్ష్మీనారాయణ పేరు తెచ్చుకున్నారు అప్పట్లో ఏ పత్రిక చూసినా,టీవీ చానెల్లో చూసినా లక్ష్మీనారాయణ వార్తలే కనిపించేవి.అంతేగాక ఆయనకు క్లీన్ ఇమేజ్ కూడా ఉంది.సిబిఐ నుండి వైదొలిగాక ఆయన మహారాష్ట్రలో ఉన్నత పదవిలో ఉంటూ ఎందుకనో రాజకీయాల వైపు వచ్చేశారు.అనూహ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు అప్పట్లో లక్ష్మీనారాయణ ప్రకటించారు.అంతేగాక జనసేన తరపున విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి అధిక ఓట్లు సాధించారు.
టిడిపి కూడా ఆయనకు విశాఖలో సహకరించిందన్న టాక్ ఉంది.అయితే రాష్ట్రంలో జనసేన చాలా ఘోరంగా ఓడిపోయి పవన్ కల్యాణ్ సైతం పరాజయం పాలయిన తర్వాత జేడీ లక్ష్మీనారాయణ కొద్దికాలం ఆ పార్టీ వైఖరిని ఆసెస్ చేసారు.కానీ పవన్ కల్యాణ్ ఫుల్టైమ్ రాజకీయ నాయకుడు కాదని జేడీ ఫీలయ్యారు.పైగా పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించడాన్ని జేడీ వ్యతిరేకించారు.రెండు పడవల మీద ప్రయాణం సరికాదని పవన్ కల్యాణ్ కు చెప్పేసి లక్ష్మీనారాయణ జనసేన నుంచి బయటకొచ్చేశారు.ఆ తర్వాత ఆయన పెద్దగా వార్తల్లో లేరు గానీ…మళ్లీ ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారని జేడీ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
పైగా తాను పోటీ చేసి ఓడిపోయిన విశాఖపట్నం ఆయనకు బాగా నచ్చిందని అక్కడినుండే ఎంపీ కావాలని ఆయన డిసైడ్ అయిపోయారని ఆ వర్గాలు చెప్పాయి.ఈ నేపధ్యంలో జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.రెండు వెయ్యి పధ్నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం లో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు వైసిపి అభ్యర్థి ,ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ను ఓడించడం తెలిసిందే.పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూడా విశాఖపట్నం జిల్లాలో బిజెపి అభ్యర్థి మాధవ్ జయకేతనం ఎగరవేశారు.మొత్తం మీద చూస్తే విశాఖలో బీజేపీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది.అందువల్ల బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యపడుతుందని జేడీ భావిస్తున్నారట.బీజేపీ కూడా జేడీ పట్ల సానుకూలంగానే ఉందని పైగా ఆయనను పార్టీలో చేర్చుకుంటే బీసీలలో కూడా క్రేజ్ వస్తుందని భావిస్తోందని సమాచారం. బీహార్ ఎన్నికలు పూర్తయ్యాక జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరబోతున్నారని తెలియవస్తోంది.