తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం షెడ్యుల్ ను విడుదల చేశారు. విద్యార్ధులకు ఈ లోపుగా పోర్షన్ పూర్తి చేయాలని ఉపాధ్యాయులకు ఇప్పటికే ఉన్నత శాఖ విద్యా శాఖ ఆదేశించింది.
మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుండి మార్చి 2వ వ తేదీ వరకూ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.