వంటగదిలో ఉండే అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.. అల్లం రసం ను తాగితే మొండి వ్యాధులన్నీ పరార్.. ముఖ్యంగా ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!
వానాకాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ, బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణం.. ఈ సమస్యలను ఎదుర్కొనాలి అంటే రోగ నిరోధక శక్తి అవసరం.. అల్లంలో విటమిన్ సి తోపాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది.. అన్ని రకాల సమస్యలకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది..
అల్లంలు శుభ్రంగా కడిగి పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ ని ఒక పలుచని వస్త్రంలో వేసి ఇందులో ఉన్న రసాన్ని పిండుకోవాలి.. ఈ రసాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.. ఈ రసాన్ని నాలుగు రోజులపాటు ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి.. ఇలా తీసుకున్న ఒక చెంచా అల్లం రసాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి.. ఇది తాగటం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.. అలాగే రక్త ప్రవాహంలో రక్తం గడ్డలు కట్టుకుండా అడ్డుకుంటుంది.. కీళ్ళు, మోకాలు నొప్పులను తగ్గిస్తుంది.. గుండెపోటును రాకుండా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది మొటిమలకు కారణమైన బ్యాక్టీరియా అని కూడా నిర్మూలిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది..