Peepal Tree: రావి చెట్టు దీనే బోధి వృక్షం అని కూడా పిలుస్తారు.. ఈ చెట్టుకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.. అన్ని చెట్లు రాత్రి పూట కార్బన్ డై యాక్సైడ్ రిలీజ్ చేస్తాయి.. కానీ రావి చెట్టు మాత్రం ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది అందుకే దీన్ని “ట్రీ ఆఫ్ లైఫ్” అని కూడా అభివర్ణిస్తారు..! ఈ చెట్టు ఆకులను బెరడును పూర్వకాలం నుండి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. రావి చెట్టు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి..!! ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Peepal Tree: సంపూర్ణ ఆరోగ్యానికి రావి చెట్టు చాలు..!!
రావి చెట్టు బెరడు ను, బాగా పండిన రావి పండ్లను తీసుకొని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ మూడు సార్లు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు పండ్లను తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక స్పూన్ తీసుకుని ఒక గ్లాసు నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా 14 రోజుల పాటు చేస్తే చాలు ఆస్తమా శాశ్వతంగా తగ్గుతుంది.
రావి చెట్టు పండ్లను తింటే అంటే ఆకలి లేని వారికి ఆకలి బాగా పెరుగుతుంది. జీర్ణాశయంలో మంట తగ్గుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి రావి చెట్టు ఆకులు దోహదపడతాయి. 3 రావి చెట్టు ఆకులను తీసుకొని 50 గ్రాముల బెల్లం తో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజంత పరిమాణం లో ఉండలుగా చేసే చేసి నీడలో ఆరబెట్టు కోవాలి . ఆరిన తరువాత వీటిని ఒక క గాజుసీసాలో భద్ర పరచుకోవాలి. ఈ మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రావి చెట్టు బెరడు ను నీటి లో వేసి మరిగించాలి. ఆ నీటిని నోట్లో పోసి పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నీళ్లు మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి. బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటే మలబద్ధకం తగ్గుతుంది. రావి చెట్టు ఆకులను రాత్రి పూట గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఆకులను తీసేసి నీటిని మూడు పూటలా తాగితే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. రావి చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. రావి చెట్టు పండ్లను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అర టీ స్పూన్ ఈ పొడిని పాలతో కలిపి మూడు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తుంటే పురుషులలో నపుంసకత్వం సమస్య తగ్గుతుంది.
Peepal Tree: రావి చెట్టు ఆకులతో మెరిసే మోము మీ సొంతం..!!
రావి చెట్టు బెరడు ను పొడి చేసుకొవలి. ఒక స్పూన్ రావి బెరడు పొడి, శెనగపిండి ని నీళ్లతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా. చేస్తుంది. రావి చెట్టు ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.