మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా సెట్స్ మీదకి వెళ్ళిన ఆచార్య సమ్మర్ కి రిలీజ్ చేసేలా కొరటాల నాన్స్ స్టాప్ గా షూటింగ్ జరుపుతున్నాడు. సోమవారం నుంచి మెగాస్టార్ ఆచార్య సెట్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. అలాగే డిసెంబర్ రెండవ వారం నుంచి కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాబోతుందని అంటున్నారు.
కాగా తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఉన్న పవర్ ఫుల్ విలన్ పాత్రకి అరవింద స్వామీ ని తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ గా అరవింద స్వామీ అదరగొట్టాడు. చరణ్ తో కూడా మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు ఆచార్య కి అరవింద స్వామి ని తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ సహా టాలీవుడ్ నటులని అనుకున్నప్పటికి వారెవరు కరెక్ట్ కాదని కొరటాల భావించాడట.
ఇక తప్పదు అరవింద స్వామీ మాత్రమే ఫైనల్ ఆప్షన్ అని ఫిక్సైయ్యారని తెలుస్తోంది. వాస్తవంగా అయితే ధృవ తర్వాత టాలీవుడ్ లో అరవింద స్వామీ కి బాగానే అవకాశాలు వచ్చినప్పటికి రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో కాదనుకున్నారట. కాని ఆచార్య కి మాత్రం అరవింద స్వామీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా ఒకే అనుకునంట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అధికారక ప్రకటన వస్తే గాని తెలియదు.