గుంటూరు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎక్సైజ్ సూపరిటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే ఈ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బాలకృష్ణన్ ను సస్పెండ్ చేసారు.
గత కొంత కాలంగా ఈ వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వివాదం విషయం ఎక్సైజ్ శాఖలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణన్ పై ఇదే మొదటి ఆరోపణ కాదు. ఆయనపై గతంలో కూడా వేధింపు ఆరోపణలు ఉండడం గమనార్హం. దీంతో బాలకృష్ణన్ పై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేసింది. విచారణ కమిటీ ఎదుట బాధితులు తమ ఆవేదనను, తమను ఎలా వేధించిందీ చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం బాలకృష్ణన్ పై చర్యలు తీసుకునే అవకాశముంది.