బాహుబలి తరువాత ప్రభాస్ చేసే సినిమాల రేంజ్ మారిపోయింది. తెలుగు హీరో అన్న ట్యాగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి చేరుకున్నాడు ప్రభాస్. నిర్మాతలు, ప్రభాస్ ఒక్కో సినిమా కి మినిమం 200 కోట్లు పెడుతున్నారు. కొన్ని సినిమాలకి అయితే ఏకంగా 300 కోట్లు పెట్టడానికి కూడా వెనుకంజవేయటలేదు. మన నిర్మాతలు ఎవ్వరు ఇంత బడ్జెట్ పెడతారని కలలో కూడా ఎవ్వరూ అనుకుని ఉండరు.
కానీ బాహుబలి సినిమాతో రాజమౌళి వచ్చి ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇది చూసిన నిర్మాతలు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు అన్ని వందల కోట్లు పెట్టడానికి కూడా ఆలోచించట్లేదు. అంతేకాకుండా కేవలం ప్రభాస్ కోసమే నిర్మాత లు సినిమాలు తియ్యడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు అయితే భారీగానే ఒప్పుకుంటున్నాడు. అలాగే ఒక్కో సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఇండస్ట్రీ రికార్డులన్నీ తన సొంతం చేసుకోనున్నాడు. ఇంతకీ అంత మాస్టర్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? ఇక నుంచి ఏడాదికి కేవలం రెండు సినిమా లు చేస్తానని ప్రభాస్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ చివరికి అందుకు భిన్నంగానే జరిగింది. ప్రభాస్, సాహో సినిమా కోసం రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రాధే శ్యామ్ కి కూడా పరిస్థితి అలానే ఉంది. కానీ ఇంక ఇప్పటినుంచి తన సినిమాల మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభాస్. ప్రతీ ఆరు నెలలు లేదా 9 నెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు ప్రభాస్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమా లు ఉన్నాయి.