Madanapalle Double Murder: ప్రస్తుతం మదనపల్లె డబుల్ మర్డర్ మిస్టరీ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన సంచలన విషయాలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఇద్దరు వ్యక్తులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తమ మూఢ విశ్వాసంతో చివరికి తమ ఇద్దరు కుమార్తెల్ని చంపుకున్నారు. ఇప్పటివరకు మరే తల్లిదండ్రులు చెయ్యని రీతిలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు.
అయితే, ఈ డబుల్ మర్డర్ గురించి బుగ్గకాలువకు చెందిన సుబ్బరామయ్య అనే ఓ భూతవైద్యుడు మీడియా ముందుకు వచ్చారు. ఆయన కొన్ని కొత్త విషయాల్ని వెల్లడించారు. తాను యాభై ఏళ్లుగా దుర్గ మాత భక్తుడినని ఆయన చెప్పారు. ఈ శనివారం ఉదయం భాస్కర్ మరియు రాజు అనే ఇద్దరు అన్నదమ్ములు తమ బంధువుల పిల్లలకు చాలా సీరియస్ గా ఉందని చెప్పగా వారితో పాటుగా సుబ్బరామయ్య పురుషోత్తం నాయుడు మరియు పద్మజ ఇంటికి వెళ్ళాడట.
ఆ సమయంలో అతనికి ఆ ఇంటి పై అంతస్తు నుంచి ఒక అమ్మాయి అరుపులు వినిపించాయని మరియు ఆ పిల్లల అమ్మ వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరగా వారి కోరినట్లే తాను ఒక మంత్రించిన తాయుత్తు ను ఆమెకు ఇచ్చానని చెప్పుకొచ్చారు ఆ భూతవైద్యుడు. కానీ తాను వారి ఇంటికి వెళ్లేసరికే అక్కడ ఎవరో ఒక సన్నటి వ్యక్తి ఆ అమ్మాయిల దగ్గర కూర్చొని వారి చెవిలో శంఖం ఊదటం తాను చూసినట్లు చెప్తున్నారు. తాను మంత్రించి ఇచ్చిన తాయిత్తుకు వారు రూ.300 ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కానీ తర్వాత తాను వెనుతిరిగానని ఆ తరువాత అక్కడ ఏం జరిగిందో తనకు తెలీదన్నారు.
ప్రస్తుతం ఈ హత్యలకు ముందు ఆ అమ్మాయి చెవిలో శంఖం ఊదిన ఆ సన్నటి వ్యక్తి ఎవరన్నది తెలిస్తే ఈ డబుల్ మర్డర్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వీలుందని పోలీసులు చెబుతున్నారు.