ఆర్ ఆర్ ఆర్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరీర్ లో 29 వ సినిమా. తన 30 వ మైల్ స్టోన్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చేయనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కాని అందరికీ కారణం తెలిసిందేగా కదా. అందుకే ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉంది. త్రివిక్రం పాన్ ఇండియా రేంజ్ స్క్రిప్ట్ ని ఈ సినిమా కోసం రాస్తున్నారట. ప్రస్తుతం ప్రచారంలో అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ ఉంది. కాని ఇది అసలు టైటిల్ కాదని సమాచారం.
ఇక ఈ సినిమా కోసం భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. ఇక ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సారి పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి అది కూడా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30వ సినిమా అన్నది కూడా ఒక ప్రత్యేకత.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ని త్రివిక్రమ్ ఓ కీలక పాత్రలో నటింప జేయాలనుకుంటున్నాడన్న వార్తలు వచ్చినప్పటికి అవి కేవలం గాసిప్ అని అన్నారు. అంతేకాదు ఈ సినిమాకి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అయినను పోయిరావలే హస్తినకు అన్న టైటిల్ కూడా అంత క్యాచీగా లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దాంతో ఎన్.టి.ఆర్ అభిమానులు మంచి క్యాచీ టైటిల్ ని పెట్టాలని సూచిస్తున్నారట.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా నటించే హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది. కాని ఇందులో కూడా ఎంత వరకు నిజముందో ఖచ్చితంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చినప్పుడే నమ్మగలం. బాలీవుడ్ లో జాన్వీ కి మంచి క్రేజ్ అయితే ఉంది. ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టు జాన్వీ గనక ఫైనల్ అయితే బాగానే ఉంటుంది. ఇక ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.