టీడీపీ నేతలకు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుండటంపై పార్టీ వర్గాలు సణుగుతున్నాయి.
సత్తా ఉన్నా లేకున్నా టిడిపి అయితే చాలు వైసీపీలోకి వస్తామన్న ప్రతివారిని జగన్ పార్టీలోకి చేర్చేసుకుంటున్నారని వారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టిడిపిని నిర్వీర్యం చేయడంతోపాటు వైసీపీని తిరుగులేని శక్తిగా రూపొందించటం జగన్ వ్యూహం కావచ్చు. కానీ కొత్తగా పార్టీ లోకి వస్తున్న టిడిపి వారి వల్ల కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్న విషయం జగన్ దృష్టికి వస్తున్నట్లు కనిపించడం లేదు..2014 ఎన్నికల్లో వైసీపీపై కేవలం 1 శాతం తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఆ తరువాత వైసీపీని పూర్తిగా తొక్కేయాలని.. 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చంద్రబాబు చేర్చుకున్నారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది.వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నాడు నిండు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాకుండా వాక్ అవుట్ చేసి.. వాళ్లు ఉన్నంత వరకు అసెంబ్లీకి రాము అని స్పష్టం చేశాడు. ఆ సమయంలో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలోనూ దీన్ని హైలెట్ చేశారు.
జగన్ పాదయాత్రలో దీన్నే అస్త్రంగా మలిచారు. ప్రతీ సభలోనూ వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా లాగేసి చంద్రబాబు మంత్రులను చేశాడని.. నేను అలా చేయను అని చెప్పి మరీ అధికారంలోకి వచ్చాడు జగన్.కానీ ఇప్పుడు కూడా టీడీపీ హయాంలో జరిగినట్టే జరుగుతోందన్న ఆవేదన వైసీపీలో ఉంది.పైగా ఇంతకు ముందు జగన్ ఎవరైనా వేరే పార్టీ వాళ్లు వైసీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్న షరతు విధించారు.ఇప్పుడు ఆ షరతుకు కూడా జగన్ మినహాయింపు ఇచ్చి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకు కండువా కప్పకుండా వాళ్ల కొడుకులకు.. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన వాళ్లకు నేరుగా కండువా కప్పుతున్నారు.
ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం వల్లభనేని వంశీ మద్దాలి గిరి లను ఇలాగే పరోక్ష పద్ధతిలో జగన్ వైసీపీలో చేర్చుకున్నారు.ఏపీలో ఎక్కడ చూసినా దీనిమీదే చర్చ జరుగుతోంది.టీడీపీకి వైసీపీకి ఏమీ తేడా ఉందని జగన్ పార్టీ వారే గొణుక్కుంటున్నారు.ఇక టిడిపి తరపున ఎంపీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన సిద్దా రాఘవరావు , చలమలశెట్టి సునీల్ తదితరులకు కూడా జగన్ పార్టీలో ప్రవేశం కల్పించారు.పలువురు టిడిపి మాజీ ఎమ్మెల్యేలను కూడా చేర్చేసుకున్నారు. వీరి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యేలు ఇన్చార్జి లకు వారు తలనొప్పి కలిగిస్తారు అన్న విషయాన్ని జగన్ గుర్తించడం లేదని పార్టీ వర్గాలు వాపోతున్నాయి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?