ఇటీవల ఫేస్ బుక్ లో పెట్టిన చిన్న పోస్ట్ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పంజాబ్ లోని తరన్ తారాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కిలా కవి సంతోష్ సింగ్ గ్రామంలో పారంజిత్ సింగ్ అనే వ్యక్తి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామంలో జస్బీర్ సింగ్ అనే పేరు గల మాజీ సైనికుడు నివసిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో గ్రామంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పారంజిత్ సింగ్ డ్రగ్స్ అమ్ముతున్నాడు అని ఆరోపిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెడుతూ మాజీ సైనికుడు జస్బీర్ సింగ్ …. ఆ మెడికల్ షాప్ గురించి బ్యాడ్ గా చిత్రీకరిస్తూ… వైరల్ చేశాడు.
దీంతో షాపు యజమాని కొడుకు సుఖ్ చైన్ సింగ్ … ఆ మాజీ సైనికుడు కి అసత్య ఆరోపణలు చేయవద్దని వ్యాపారం చెడగొట్ట వద్దండి అంటూ కొన్ని మార్లు విజ్ఞప్తి చేశాడు. అయినా జస్బీర్ అదేమీ వినిపించుకోకుండా ఏకంగా… ఓరోజు షాపు వద్దకు వచ్చి పెద్ద గొడవకు దిగాడు. దీంతో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన మాజీ సైనికుడు జస్బీర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో షాపు పై కాల్పులు జరిపారు. షాప్ లో ఉన్న సుఖ్ చైన్ సింగ్ (26) తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు.
ఈ పరిణామంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు మొత్తం షాపు సీసీటీవీలో రికార్డు కావడంతో… వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఫేస్బుక్ లో గొడవ అయిందని చంపేస్తావా? నీకు తుపాకీ ఇచ్చింది బోర్డర్ లో శత్రువుని కాల్చడానికి. వామ్మో నీ లాంటోడు ఉంటే గ్రామాల్లో ఇంకా ఎవరు ఫేస్ బుక్ వాడారని…నెటిజన్లు రకరకాలుగా ఈ ఘటనపై కామెంట్లు పెడుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?