beauty: మనం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి బయట దొరికే క్రీములు వాడతాం కానీ మనస్సు పెట్టి మనకు అందుబాటులో ఉండే మంచి మంచి వస్తువుల జోలికి మాత్రం వెళ్ళాము.అలాంటి వాటిలో ముఖ్యమైనది బియ్యప్పిండి. చర్మాన్ని అందంగా మార్చే గుణం బియ్యపు పిండి కి ఉంటుంది. దీన్ని వాడే పద్ధతిలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. బియ్యం పిండి కి కొన్ని రకాల పదార్థాల కాంబినేషన్ తో ముఖానికి రాసుకుంటూ ఉంటే కొన్ని రోజుల్లోనే మార్పు గమనిస్తారు.
కొద్దిగా బియ్యప్పిండి గిన్నెలో కి తీసుకొని, చిటికెడు బేకింగ్ సోడా, తేనె ఒక టేబుల్ స్పూన్ జోడించి బాగాకలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి రెండు నిమిషాలు ఉంచి సున్నితంగా మసాజ్ చేసి బాగా ఆరిన తర్వాత నీటితో కడుక్కోవాలి ఇలా వారానికి 2 సార్లు చేయడం వలన అద్భుతం గా పనిచేస్తుంది.
రెండు టేబుల్స్పూన్ల బియ్యప్పిండి, సరిపడా పచ్చిపాలు ఒక గిన్నెలో కి తీసుకొని బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట వరకు ఆరనిచ్చి శుభ్రం చేసుకుంటే సరి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బియ్యప్పిండిలో ఉండడం వలన చర్మాన్ని తాజాగాఉండేలా చేస్తాయి. గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ , ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత బాగా కలిపి ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిపోయాక వాటర్ తో క్లీన్ చేసుకుంటే మెరిసే చర్మం పొందవచ్చు.
అరటిపండు గుజ్జు,టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, అర టేబుల్స్పూన్ ఆముదం నూనె తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకింద రాసుకుని అరగంట సేపు అలాగే ఉండాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మెరిసే చర్మం మీ సొంతం.
ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యప్పిండి, సరిపడా రోజ్ వాటర్ తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమానికి కొంచెం గ్లిజరిన్కలిపి కూడా కలిపి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పూర్తిగా ఆరిన తర్వాత కాస్త గోరువెచ్చని నీటితో కడుగుతూ ఉంటే చర్మ సౌందర్యం మీ సొంతం. పైన చెప్పిన పద్ధతులు వారంలో ఒకటి రెండు సార్లు చేసిన మంచి ఫలితం ఉంటుంది.