Kamakya Devi temple: మన భారతదేశ ప్రాచీన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు యావత్ ప్రపంచం ఆశ్చర్యపడుతూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికతకు, ఆలయాలకు ప్రతీక మన భారతదేశం అంటారు. హిందూ మతంలో మనకు 64 కోట్ల దేవతలు కలిగి ఉన్నారు. ఈ పవిత్ర భారత భూమిలో ఎన్నో విశిష్టతలు మరెన్నో ప్రత్యేకతలు. ఈ భూమి మీద అడుగడుగునా మనకి దేవాలయాలు తారసపడుతుంటాయి. ఇందులోనే కొన్ని విచిత్రమయిన ఆచారాలతో అసాధారణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు అంతుచిక్కకుండా కొన్ని దేవాలయాలలో పద్ధతులు మనకి కనిపిస్తుంటాయి. ఇందులో భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం Kamakya devi temple ఉంది. ఇటువంటి దేవాలయాలలో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కూడా ఉన్నాయి. అయితే లాజిక్ లేకుండా కొన్ని దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిపాయి.
భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం అస్సాంలోని గువహతిలో ఉంది. ఈ ఆలయం నీలగిరి పర్వతం పై ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఈ కామాఖ్య దేవి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవి యోని మాత్రమే ఇక్కడ పూజింపబడుతుంది. అలాగే అమ్మవారి యోని పై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతారు.
ఈ దేవత మూర్తికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రుతుస్రావం జరుగుతుందట. అందుకే వర్షాకాలంలో మూడు రోజుల పాటు ఈ దేవాలయాన్ని మూసి వేస్తారట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర ఆ మూడు రోజులు నుంచి వచ్చే జలం ఎర్రగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో భక్తులు సతీదేవికి ఎర్రటి వస్త్రాలను సమర్పిస్తుంటారు.