మైదా అనేది తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మైదా తో వంటలు త్వరగా తయారు చేసుకోవచ్చు. అందుకే చాలా మంది మైదా ని ఉపయోగిస్తుంటారు. అయితే మైదా తో చేసినవి తినడం ఎంత ప్రమాదమో తెలిస్తే,కచ్చితంగా వాడడం మానేస్తారు.పిజ్జా, బర్గర్స్ ,పాస్తా,బ్రెడ్, కేక్స్, కుకీస్, డోనట్స్, మఫ్పిన్స్, న్యూడుల్స్,… వీటి తయారీలో మైదా కలుపుతారు.
గోధుమ పిండి వ్యర్థాల్లో ప్రమాద కర రసాయనాలు కలిపి రిఫైన్డ్ చేయడం ద్వారా,మైదాపిండి తయారవుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు పోషకాలులాంటివి ఏ ఒక్కటి ఉండవు. ఇది తేలికగా జీర్ణంఅవడం వలన రక్తం లో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.తద్వారా ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. మైదా తినడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో తెలుసుకుందాం. వీలైనంత త్వరగా దాని నుండి దూరంగా వెళ్దాం.
మైసూర్ బోండాం లాంటి వాటిని మైదా తోనే చేస్తారు. అలాంటి వాటిని ఎక్కువగా తినడము వలన వేగం గా బరువుపెరిగిపోతారు.శరీరం లో కొవ్వు పెరిగి,ఊబకాయం వచ్చేస్తుంది. కాబట్టే మైదా కు దూరం గా ఉండడంమేలు.మైదా తో చేసిన పదార్థాలు జీర్ణం కాక మన పేగులకూ అతుక్కుపోతాయి. అలా అతుక్కు పోవడం వలన పేగుల్లో క్రిములు పుట్టి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.ఇది రాను రాను క్యాన్సర్ వంటి రోగాల కూ కారణమవుతాయి.కిడ్నీ లో రాళ్లు ఏర్పడతాయి.
మైదా తింటూ ఉంటే, క్రమంగా టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తుంది. మైదా లో షుగర్ లెవెల్స్ పెంచే గుణాలు చాలా ఎక్కువ. మైదా వంటలు తింటే,ఒక్కసారిగా ఇన్సులిన్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక్కసారి షుగరు వస్తే ఇక పోదు. దాన్ని ఎప్పటికప్పుడు అదుపుచేస్తుకుంటూ ఉండాలి.ఆ ఇబ్బంది రాకూడదంటే మైదా కి దూరం గా ఉండాలి.
తరచూ మైదా తో చేసిన పదార్థాలు తింటూ ఉంటే,పొట్టలో బరువుగా, ఉంటుంది.తీసుకున్న ఆహారం జీర్ణం కాదు. గ్యాస్ తయారపవుతుంది. త్రేన్పులు వస్తూ ఉంటాయి. మలబద్ధకం కూడా వేధిస్తూ ఉంటుంది. ఇవన్నీ మైదా తినడం వలన వచ్చే సమస్యలే.
మైదా లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వలన అది శరీరం లో పెరిగే కొద్దీ అనేక మైన రోగాలువస్తాయి. ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం,వేడి ఇలాంటి వన్నీ కలిసి, హైబీపీ వచ్చే లా చేస్తాయి. అందుకే మైదాతో చేసిన వంటల కు దూరం గా ఉండాలి .
మైదా అనేది రుచికరమైన రోగాల పుట్ట గా చెప్పవచ్చు. మెదడు,గుండె, కళ్లు, చర్మం,ఇతర శరీర అవయవాల్ని రోగాలతో పాడుచేస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, మైదాను తినకుండా ఉండడం మేలు.మైదా తో తయారయ్యే ఒక్క పదార్థం కూడాతీసుకోవద్దు. మన దేశం లో ఉన్న చాలా విదేశీ ఫుడ్ కంపెనీలుమైదా పదార్థాల్నే జంక్ ఫుడ్ రూపం లో అందిస్తున్నాయి.నూడుల్స్, మక్రోనీ పిజ్జాలు, బర్గర్లు,మన దేశ ఆహారం కాదు. తేలికగా గా వండేయాలని విదేశీయులు వీటిని ఎంచుకున్నారు. ఆ తర్వాత వాటిని భారతీయుల కు కూడా అలవాటు చేశారు. వారు డబ్బు సంపాదిస్తుంటే మనం జబ్బులు తెచుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.