Marriage: ప్రపంచ దేశాలలో ఉన్న ఎన్నో వైవాహిక వ్యవస్థలలో భారతదేశ వైవాహికవ్యవస్థ చాలా ప్రాచుర్యాన్ని పొందింది. భారతీయ వైవాహిక వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ వివాహం మతపరంగా కూడా ఎంతో పవిత్రతను కలిగి ఉంది. పెళ్లి లో జరిగే తంతుల వలన భార్యాభర్తల మధ్య ఎక్కువ కాలం నిలబడుతుందని నిరూపింపబడినది. ఇన్ని ఆచారాలు, వేదమంత్రాల నడుమ జరగడం వలనే మన హిందూ ధర్మంలో పెళ్లి అనేది ఓ విడదీయరాని బంధంగా చెప్పబడినది.
ఇక హిందూ ధర్మంలో వివాహ సంప్రదాయంలో మొత్తం 35 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఎవరి ఆచారాలను బట్టి వారు ఈ 35 లో కొన్ని మాత్రమే పాటిస్తున్నారు. వివాహ ఘట్టాలలో మొదటిగా వివాహ ప్రక్రియ పెళ్లిచూపులతో మొదలవుతుంది. ఆ తరువాత నిశ్చితార్థం, వరపూజ, ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, మధుపర్కాలు, కాళ్లుకడగటం, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, పాణిగ్రహణం, సన్నికల్లు తొక్కడం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ నక్షత్ర దర్శనం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, గర్భాదానం ఇలా మొత్తం 35 గుట్టలుగా వివాహం చెప్పబడినది.
అయితే అరుంధతి నక్షత్రాన్ని సరిగ్గా చూడగలిగితే ఎక్కువ కాలం జీవిస్తారు అని మనం పెళ్లిలో ఎక్కువగా వింటూ ఉంటాం. హిందూ శాస్త్రాలలో అరుంధతి నక్షత్రాన్ని ఓ శుభకరమైన నక్షత్రంగా చెబుతారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అరుంధతి నక్షత్రాన్ని వధూవరులు తేలికగా చూడగలిగితే వారు ఎక్కువ కాలం జీవిస్తారని భారతీయులు విశ్వాసం.
సాధారణంగా అరుంధతి నక్షత్రం సప్త ఋషి నక్షత్ర మండలానికి కొంచెం దూరంలో ఉంటుంది. కేవలాం ఎటువంటి చూపు లోపం లేనివారే దానిని చూడగలరు. మరి అంత మంచి ఆరోగ్యం ఉంటే కచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతుకుతాడనే కదా అర్ధం.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.