ఏదని చెప్తాము..? ఎన్నని చెప్తాము..? మనిషి మెదడుని స్మార్ట్ ఫోన్ అనబడే పరికరంలో దాచేసి… దాన్నుండి లోకాన్ని చూస్తుంటే ఇక నిజాలు ఎలా కంటికి కనిపిస్తాయి. ఫోన్ ఏం చూపిస్తే అవే కనిపిస్తాయి. అందులో నిజాలు అనే సంగతి పక్కన పెట్టి… తన స్మార్ట్ ఫోన్ లో వచ్చింది.., మిగిలిన వార్ స్మార్ట్ ఫోన్లకు పంపించేయాలి అని ఒక పైత్యం ఏడిసింది… కాబట్టి మెదళ్ళు ఫోన్ల బందీల నుండి బయటకు వచ్చే వరకు దీన్ని “ఫేకుల కాలం” అనే వర్ణించాలి.
రోజుకో వెర్రి వార్త… జనాలను వెర్రిగా మార్చేస్తుంది. కరోనా పుణ్యమా అని రోజుకి రెండు, మూడు వచ్చేస్తున్నాయి. తాజాగా ఏమి వచ్చింది అంటే… ఇదిగో “కరోనా వాక్సిన్ వచ్చేస్తుంది. భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ స్వయంగా కరోనా వాక్సిన్ వేసుకున్నారు. ఆ వాక్సిన్ పై వారికి ఎంత నమ్మకం ఉందొ చుడండి” అంటూ నిన్న మొత్తం ఆ ఫోటో, మేటర్ వైరల్ అయింది. దాదాపు వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్ కి ఈ మెసేజ్ చేరిపోయింది. ఇది ఫేక్ అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఫోటో నమ్మశక్యంగా ఉంది, కింద మేటర్ అలాగే ఉంది.., పైగా భారత్ బయోటెక్ నుండి ఆగష్టు 15 నాటికి కరోనా వాక్సిన్ వస్తుందని ICMR ప్రకటించింది. అందుకే ఈ ఫోటోని ఎవ్వరూ అనుమానించలేదు. ఇక తాజాగా తేలింది ఏమిటీ అంటే…!!
ఆ ఫోటో నిజమే.., కానీ మ్యాటర్ నిజం కాదు. భారత్ బయోటెక్ సంస్థలో ఉద్యోగులకు యధావిధిగా అప్పుడప్పుడు ఇలా రక్త పరీక్షలు చేయిస్తుంటారు. అందులో భాగంగా ఆ శ్రీనివాస్ కి రక్త పరీక్షలు చేసినప్పుడు ఎప్పుడో తీసిన ఫోటో అది. దాన్ని నిన్న ఎవరో వైరల్ చేసారు. జనం అనబడే వాళ్ళు అందరూ వెర్రిగా నమ్మేసాం. ఈరోజు “అది అబద్ధం.., ఇది నిజం” అని తెలుసుకుని నాలుక కరుచుకోవడమే. సాక్షాత్తూ ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. మాలో ఏ ఉద్యోగి కూడా ఆ వాక్సిన్ ప్రయోగించుకోలేదు. అది నమ్మవద్దు అంటూ ప్రకటన విడుదల చేసింది. సదరు శ్రీనివాస్ కూడా చాల మందికి, తమ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?