బుల్లి తెర మీద యాంకర్ గా, సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతమైన పాత్రలు పోషిస్తున్న నటిగా అనసూయ ఈ మధ్య కాలంలో చాలా క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకుంది. సినిమాలలో కొన్ని పాత్రలు తన కోసమే అన్నట్టుగా తయారవుతున్నాయి. బుల్లితెర మీద తన స్టైల్లో ఎలాగైతే ప్రేక్షకులను మెప్పిస్తుందో సినిమాలలోను తను పోషిస్తున్న పాత్రలతో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటుంది.
సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా నటించి అనసూయ సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాగే ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ సినిమాలలో నటించిన అనసూయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని స్థానాన్ని సంపాదించుకుంది. అయితే రీసెంట్ గా అనసూయ ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ’అంశాలమీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
అనసూయ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని వెల్లడించింది. ఇండస్ట్రీలో మీటూ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండొచ్చు… కానీ అది అమ్మాయి మీదే ఆధారపడి ఉంటుందని… ఆఫర్ ఎవరినో నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదని అంటోంది. మీ టాలెంట్ ని మీరు నమ్ముకోవాలి… బయట కాంపిటేషన్ విపరీతంగా ఉంది..అయినా మనం బాగా చేస్తే మనకొసమే కొన్ని ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయని తెలిపింది.
గతంలో తను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను. ఆ విషయాలు చెప్పి ఎప్పుడు అనవసరమైన చర్చలు పెట్టలేదని వెల్లడించింది. నన్ను కొంతమంది ఇబ్బంది పెట్టినప్పటికి నన్ను నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ క్యారెక్టర్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని అందరూ అనుకునేలా కష్టపడాలి. లైఫ్ లో అదే టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్ లాంటివి దరిదాపుల్లోకి కూడా రావని తెలిపింది. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో అనసూయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.