ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మకమైన సినిమా ఆర్ ఆర్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరో గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తుండగా మొత్తం 6 రకాల గెటప్స్ లో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ నటిస్తుంది.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30 వ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమాగా త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించేందుకు భారీ స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి 2022 సంక్రాతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. కే.జీ.ఎఫ్ ఫ్రాంఛైజీతో సంచలన దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే తారక్, ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో చర్చించుకున్నారట. ఇద్దరు ఎంతో ఎగ్జైట్ గా ఉన్నారట.
ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్.టి.ఆర్ 32 కోసం కథలు వింటున్నాడట. కొరటాల శివ, సురేందర్ రెడ్డి, సుకుమార్ లాంటి వాళ్ళు తారక్ కోసం క్యూలో ఉన్నారని సమాచారం. అయితే ఈ క్యూలో మెహర్ రమేష్ కూడా ఉన్నాడని తారక్ టైం ఇస్తే కథ చెప్పాలని ప్రయత్నిస్తున్నాడట. ఈ విషయం తెలిసిన తారక్ ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లోను మెహర్ రమేష్ తో సినిమా చేయొద్దని సలహాలిస్తున్నారట. అందుకు కారణం మెహర్ రమేష్.. తారక్ తో శక్తి లాంటి డిజాస్టర్ తీయడమే. మరి ఈ విషయంలో తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.