Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ” సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రాబరీ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పరిస్థితులు మారటంతో.. మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో.. కీలక సన్నివేశాలతో పాటు ప్రధాన పాత్రలకి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ త్వరగా కంప్లీట్ చేసేస్తున్నారు అట. మిగతా బ్యాలెన్స్ సాంగ్స్ మరియు ఫైట్స్ తీరికగా చిత్రీకరించి కోవాలని డిసైడ్ అయ్యి.. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో అర్థంకాని పరిస్థితి ఉండటంతో సినిమాలో కీలకపాత్ర లకు సంబంధించిన క్యారెక్టర్లు.. సన్నివేశాలు కంప్లీట్ చేసే పనిలో డైరెక్టర్ పరశురామ్ ఉన్నారట.
ఇదిలా ఉంటే జూలై 31 వ తారీకు సినిమాకి సంబంధించి ఫస్ట్ నోటీస్ అంటూ.. మహేష్ ఫుల్లు లుక్ పోస్టర్ రిలీజ్ చేయటం తెలిసిందే. రెడ్ కారులో నుండి మహేష్ దిగుతున్న..స్టీల్ తో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలావరకు ఫైట్ సన్నివేశం తరహాలో కారు అద్దాలు పగిలి ఉండటంతో.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో మహేష్ స్టైల్ చాలా కొత్తగా ఉండటంతో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 95.06K లైక్స్…49.01K కామెంట్లు రావటంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది.
విడుదలైన అతి తక్కువ గంటల్లోనే అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన పోస్టర్ గా సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అదే సమయంలో మహేష్ పుట్టిన రోజు అనగా ఈ నెల 9వ తారీకు సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు.. సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో మహేష్ పుట్టిన రోజు నాడు రీలీజ్ అయ్యే టీజర్ తో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడానికి వేడుకలు గట్టిగా చేయాలన్నీ భారీఎత్తున్న రెడీ అవ్వుతున్న ఫాన్స్.