రైతుల ఆందోళనల ప్రభావం సెల్ టవర్ల పై పడుతోంది.పంజాబ్లో లెక్కకు మించి సెల్టవర్లు పొలాల్లోనే ఉన్నాయి.నెల రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారి ఉద్యమం రూపు మారుతోంది.
ఇప్పుడిప్పుడే రైతుల మద్దతుదారులు ఆస్తుల విధ్వంసం పై దృష్టి పెట్టారు. రైతులకు మద్దతుగా సోమ మంగళవారాల్లో ఆందోళనకారులు పంజాబ్లో సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేశారు. అంతేకాదు.. టవర్లుకు వెళ్లే విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెల్ ఫోన్ కనెక్టవిటీపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 1561 మొబైల్ ఫోన్ టవర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వ అధికారి ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.రాష్ట్రంలో టెలికం కనెక్టవిటీకి అంతరాయం ఏర్పడిందని చెప్పారు.
పంజాబ్ లోని ఫిరోజ్పూర్లోని టిబ్బి కలాన్ వాసులు మరో సెల్ టవర్ను ధ్వంసం చేశారు. టవర్పైకి ఎక్కి కేబుల్ వైర్లు కత్తిరించారు. సోమవారం నుంచి విద్యుత్ సరఫరా లేక 146 సెల్ ఫోన్ టవర్లపై ప్రభావం పడింది. మిగిలిన టవర్లను మద్దతుదారులు ధ్వంసం చేశారు.ఇప్పటివకరూ 433 సెల్ ఫోన్ టవర్లను రిఫేర్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో 22జిల్లాల వ్యాప్తంగా మొత్తం 2,13,06 మొబైల్ టవర్లు ఉన్నాయి. సెల్ ఫోన్ టవర్ల విధ్వంసంపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టవర్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఏదైనా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు. శాంతివంతమైన నిరసనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.కాగా ఈ ఉద్యమ చిచ్చు ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉండటంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది.రాష్ట్రాలు సైతం అలర్ట్గా ఉండాలని కేంద్రం సర్క్యులర్లు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.