అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్నారు. నిన్న బోస్టన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తో మరింత ఆవేదనకు లోనయ్యాడు. రాజధానిపై మనో వేదనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాజధాని నిర్మాణానికి రైతు మల్లికార్జునరావు పది ఎకరాల భూమి ఇచ్చారు. మల్లికార్జునరావు పట్ల రాజధాని రైతులు నివాళులర్పించారు. తుళ్లూరు నిరసన దీక్షల్లో రైతులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, నిన్న మందడంలో మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల వైఖరికి నిరసనగా శనివారం ఉదయం తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతడపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
https://youtu.be/nfzD8oXYXuI
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?