అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నేడు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. రాజధాని అమరావతిపై ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఒక్కో గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. నేటి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి మండలం ఎర్రుబాలెంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. మరో పక్క మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద సిఎం జగన్ కాన్వాయ్ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
previous post
next post