అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్కల్లు రైతులు, మహిళలు కొండపై ఉన్న వెంకటేశ్వరస్వామికి కొబ్బరికాయలు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులంతా పెయిడ్ ఆర్టిస్టులు అని కామెంట్ చేసినందుకు పృద్వికి తగిన శాస్తి జరిగిందనీ, ఏడు కొండల వాడు న్యాయం చేశాడనీ వారు హర్షం వ్యక్తం చేశారు.
previous post