Delhi : గత కొద్ది నెలల నుండి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులలో భారీ స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇటీవల రిపబ్లిక్ డే నాడు రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా.. ఆ ర్యాలీ చివరాకరికి తీవ్ర హింసకు దారితీయడంతో రైతు సంఘం నేతలకు పోలీసులకు మధ్య తోపులాట మరియు లాఠీఛార్జ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక రైతు చనిపోగా మరికొంత మంది పోలీసులు గాయాల పాలయ్యారు. దీంతో ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి తాజాగా పోలీసులకు సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సమావేశం అనంతరం నిందితులైన రైతు సంఘం నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నిందితులు ఎవరు కూడా విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని వెంటనే వాళ్లకు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయాలని కేంద్ర హోం శాఖ తెలపడంతో ఢిల్లీ పోలీసులు రైతు సంఘం నేతలకు నోటీసులు జారీ చేశారు.
మొత్తం ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటన పై 25 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎర్రకోట పై జరిగిన దాడి కేసులో పంజాబ్ సినీ నటుడు డీప్ సిద్ధూ గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నేత మాల్వా యాత్ లఖ్ బీర్సింగ్ లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదిఏమైనా గత కొంత కాలం నుండి శాంతియుత వాతావరణంలో రైతులు చేస్తున్న ఆందోళనలు నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు వచ్చిన క్రమంలో రిపబ్లిక్ డే నాడు జరిగిన హింసాత్మక ఘటన.. రైతు ఉద్యమం పై చెడ్డ పేరు తీసుకు వచ్చినట్లయింది. ఏకంగా ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో రైతు సంఘం నేతలు డైలమాలో పడినట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ డే నాడు జరిగిన పరిణామంతో ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలను పోలీసులు మరోపక్క ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.