టోల్ ప్లాజా వద్ద డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి చేసింది.. ఫాస్ట్ ట్యాగ్ జనవరి 1, 2021 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికి తెలిసిందే.. తాజాగా రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ (MoRTH) ఈ గడువును పొడిగించింది.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఐ ఐ) ఫాస్ట్ ట్యాగ్ గడువు 15 ఫిబ్రవరి 2021 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.. ఈ తేదీలోపు తప్పని సరిగా అందరూ ఫాస్ట్ ట్యాగ్ ద్వారానే చెల్లింపులు చేయాలనీ లేకపోతే డబల్ టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది..
ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా జరుగుతున్న లావాదేవీల వాటా 75-80 శాతం నుంచి ఉంటుందని చెబుతున్నారు.. ఫిబ్రవరి 15 నుంచి 100% నగదు రహిత ఫీజు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందువలన వాహన దారులు టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండకుండా, అలాగే టోల్ ప్లాజా దగర ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తుంది.
టోల్ ప్లాజా వద్ద ఉన్న అన్ని లైన్లలో ఒక్క లైన్ తప్ప మిగతా అన్ని లైన్లు ఫాస్ట్ ట్యాగ్ లైన్లుగా మారుస్తుంది.. ఫాస్ట్ టాగ్ లైన్ కాకుండా సాధారణ లైనులో నగదు చెల్లించి నట్లైతే వారికి రెట్టింపు టోల్ ఫీజు విధిస్తారు. దీని ద్వారా నైనా వాహనదారులు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడతారు. దీనిద్వారా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ తగ్గటంతోపాటు , కాగిత రహితం, ఇంధనం కూడా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. థర్డ్ పార్టీ ద్వారా వాహనాలు కోలుగోలు చేసేటప్పుడు కూడా ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని 1 ఏప్రిల్ 2021 వీటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.