కరోనా చేసిన కష్టం అంతా ఇంతా కాదు. ఎందరికో ఉపాధి లేకుండా చేసింది. రోజువారీ కూలీల జీవితాలను తలకిందులు చేసింది. అస్సాంలో జరిగిన ఓ సంఘటన వీరి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఉపాధి దొరక్క పసికందును అమ్ముకున్న ఘటన రాష్ట్రంలోని కొక్రజార్ జిల్లాలో జరిగింది.
ధంటోలా మాండరియా అనే గ్రామానికి చెందిన దీపక్ బ్రహ్మ గుజరాత్లో వలస కూలీగా పని చేస్తున్నాడు. కరోనా.. లాక్డౌన్ పరిస్థితులతో ఉపాధి పోవడంతో కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చేశాడు. స్థానికంగా ఏ పనీ దొరక్కపోవడంతో కొచుగావ్ పటకట గ్రామంలోని అత్తగారింటికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా ఏపనీ దొరకలేదు. ఈ పరిస్థితుల్లో దీపక్ భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేక రెండో బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
జులై 2వ తేదీన భార్యకు తెలియకుండా 15 రోజుల పసికందును ఇద్దరు మహిళలకు రూ.45వేలకు అమ్మేశాడు. జరిగిన దారుణం తెలియక బిడ్డ కనిపించిక అల్లాడిపోయింది. అనుమానం వచ్చి దీపక్ ను నిలదీయగా బిడ్డను అమ్మేశానని చెప్పాడు. షాక్ కు గురైన భార్య తల్లిదండ్రుల సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. దీపక్ నుంచి వివరాలు సేకరించి ఇద్దరు మహిళలను ఆచూకీ కనుగొన్నారు. వారి నుంచి బిడ్డను రక్షించి తల్లి ఒడికి చేర్చారు. దీపక్ ను పోలీసులు అరెస్టు చేశారు. తానం లేకపోవడంతోనే శిశువును కొన్నామని మహిళలిద్దరూ పోలీసు విచారణలో చెప్పుకొచ్చారు.
.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?